Posted on 2025-09-24 18:24:36
డైలీ బారత్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ప్రజాసాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా బతుకమ్మ పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పోస్టర్ను మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అనురాధ, తెలంగాణ గెజెటెడ్ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్, టీజిఓ మహిళా విభాగం చైర్ పర్సన్ జయంతి కుమారి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయ, సాంస్కృతిక విశిష్టతను ప్రతిబింబిస్తుందని, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు. విద్యార్థినులు ఈ పండుగను సాంస్కృతిక ఉత్సవంగా భావించి ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీవో పదాధికారులు దేవిసింగ్, పవనీ, నాగరాజు, చంద్ర, విజ్నేష్, సరస్వతి, విజయత, శ్రీతిల, సుజాత పాల్గొన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >