| Daily భారత్
Logo




విద్యార్థులకు ఏ.ఐ. టూల్స్ పై శిక్షణ ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

News

Posted on 2025-09-11 18:10:28

Share: Share


విద్యార్థులకు ఏ.ఐ. టూల్స్ పై శిక్షణ ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వేములవాడ అర్బన్ లోని కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ

డైలీ భారత్, వేములవాడ: విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక ఏఐ టూల్స్ పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. 

వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా విద్యాలయంలోని వంటగది, స్టోర్ రూము, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజు అందిస్తున్న భోజన, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు చుట్టూ అపరిశుభ్రత, రహదారి, విద్యాలయం భవనానికి ప్రహరీ  లేనట్లు గమనించారు. విద్యాలయం ఆవరణను శుభ్రంగా చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్డు, ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

పాఠాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని..

పాఠశాలలోని 7వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఎకనామిక్స్ కంప్యూటర్స్ పాఠాలను బోధించారు. ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. విద్యార్థులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు తరగతి గదికి వచ్చే ముందు పాఠాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వచ్చి విద్యార్థులకు సరిగ్గా విద్యాబోధన చేయాలని ఆదేశించారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >