Posted on 2025-09-11 14:40:28
వేములవాడ అర్బన్ లోని కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ
డైలీ భారత్, వేములవాడ: విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక ఏఐ టూల్స్ పై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
వేములవాడ అర్బన్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యాలయంలోని వంటగది, స్టోర్ రూము, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతి రోజు అందిస్తున్న భోజన, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు చుట్టూ అపరిశుభ్రత, రహదారి, విద్యాలయం భవనానికి ప్రహరీ లేనట్లు గమనించారు. విద్యాలయం ఆవరణను శుభ్రంగా చేయాలని వేములవాడ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రోడ్డు, ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
పాఠాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని..
పాఠశాలలోని 7వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు మ్యాథ్స్, సోషల్, సైన్స్ ఎకనామిక్స్ కంప్యూటర్స్ పాఠాలను బోధించారు. ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. విద్యార్థులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు తరగతి గదికి వచ్చే ముందు పాఠాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వచ్చి విద్యార్థులకు సరిగ్గా విద్యాబోధన చేయాలని ఆదేశించారు.
గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!
Posted On 2026-08-27 05:16:28
Readmore >
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >