Posted on 2025-09-11 12:24:33
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: జెసిఐ వారోత్సవాల్లో భాగంగా గురువారం మూడో రోజు సందర్భంగా నిజామాబాద్ క్యూర్ యోగా ట్రేైనర్ డాక్టర్ ఐశ్వర్య ఆధ్వర్యంలో యోగ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యతను విశదీకరించారు. యోగా శరీరాన్ని బలపరచడమే కాకుండా, మనసును పదునుగా మార్చి జీవనశైలిలో ఆరోగ్యానికి సమతుల్యతను తీసుకువస్తుందని చెప్పారు. గృహిణి అయినా, ఉద్యోగి అయినా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జీవితంలో చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అని ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత పొందవచ్చు అని అన్నారు. రోజుకు కనీసం 30 నుండి 45 నిమిషాలు యోగకు సమయం కేటాయించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు, ఒత్తిడి తగ్గుతుందన్నారు. సమగ్ర ఆరోగ్యం మెరుగుపడుతుంది అని తెలిపారు.
కార్యక్రమం లో జేసీఐ ఇందూరు అధ్యక్షురాలు గౌతమి పెండోటి సభ్యులు,మహిళలు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >