Posted on 2025-09-10 16:34:06
అక్రమంగా దళిత బిడ్డ రోహిత్ ను అరెస్టు చేసిన పోలీసులు.
గణేష్ నిమజ్జనం రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటపై డాన్స్ చేయడమే నేరమా..
కేసీఆర్ పాటలు వింటే పోలీసుల కెందుకు అభ్యంతరం..
పోలీసు ల నిర్బంధంలో దళిత యువకుడు రోహిత్
మీరు ప్రజలను కాపాడే పోలీసులా?, హింసించే కాంగ్రెస్ కార్యకర్తలా?
పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందిరమ్మ రాజ్య మంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
ఆర్మూర్ పట్టణంలో యదేచ్ఛగా పోలీసు ఆరాచకాలు కొనసాగుతు న్నాయని, కొందరు పోలీసు అధికారులు
అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి కాంగ్రెస్ సేవలో తరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆర్మూరు లో యువకులు పెద్దఎత్తున మళ్లీ కేసీఆరే రావాలి, కారే రావాలి అని పాటలు వింటూ డ్యాన్స్ లు చేస్తే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ పాటలు వింటే పోలీసుల కెందుకు అభ్యంతరం అని ఆయన నిలదీశారు. దళిత యువకుడు రోహిత్ ను పోలీసులు అక్రమంగా నిర్బంధించి రెండు రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారని, రోహిత్ కోసం ఆయన కుటుంబ సభ్యులు విలపిస్తున్నా పోలీసులకు కనికరం లేదని జీవన్ రెడ్డి అన్నారు.
తాను ఎన్ని సార్లు ఫోన్ చేసినా పోలీసు అధికారులు స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మీరు ప్రజలను కాపాడే పోలీసులా?, హింసించే కాంగ్రెస్ కార్యకర్తలా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్మూర్ లో అధికార పార్టీ అండదండలతో తెల్లార్లు పేకాట క్లబ్ లు జోరుగా నడుస్తున్నాయని, మట్కా జూదమాడుతున్నారని, విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతు న్నాయని, నల్లమట్టి స్మగ్లింగ్ సాగుతోందని, వారిని పట్టుకోకుండా కేసీఆర్ ను అభిమానించే వారిపై పోలీసులు ప్రతాపం చూపడం ఇది ఎక్కడి న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి ఆకృత్యాలకు పాల్పడుతున్నా రన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడైనా ఇలాంటి చిల్లర పనులు చేశామా?..అభివృద్ధికి తప్ప అరాచకాలకు చోటిచ్చామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు తొత్తులుగా మారి అరాచకాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వ మేనని, కాంగ్రెస్ కు ఊడిగం చేస్తున్న వారి లెక్కలు తెలుస్తామని ఆయన హెచ్చరించారు.
పోలీసు నిర్బంధంలో ఉన్న రోహిత్ ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రోహిత్ అక్రమ నిర్బంధంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, మానవ హక్కుల కమిషన్ కు, ఎస్సీ కమిషన్ కు పిర్యాదు చేస్తామని జీవన్ రెడ్డి వెల్లడించారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >