Posted on 2025-09-10 16:23:14
డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ శాఖ ఇచ్చిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అడిషనల్ కమిషనర్ రవీందర్ సాగర్, డిప్యూటీ కమిషనర్ రవి బాబు, ఇతర మున్సిపల్ అధికారులు అసిస్టెంట్ కమిషనర్, డి వై ఈ ఎస్ ఎస్ , ఏ ఈ ఎస్ శానిటేషన్, ఇంజనీరింగ్, మెప్మ సిబ్బంది తదితరులు పాల్గొనీ, ముగింపు ర్యాలీ నీ మున్సిపల్ కార్యాలయం నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు తీసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది నీ అభినందిస్తూ ఇదే స్పూర్తి తో భవిష్యత్ లో పని చేస్తూ నిజామాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , స్వచమైన నీటిని ప్రజలకు అందిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు జవాన్లు శానిటరీ ఇన్స్పెక్టర్లకు వంద రోజుల్లో అద్భుతంగా పని చేసిన పనిచేసిన అధికారుల ను , సిబ్బంది ని సన్మానించారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దాలంటే శానిటేషన్ వర్కర్ల పనితీరు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. 100 రోజుల ప్రణాళికను పెట్టుకుని నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దరంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడమే పారిశుద్ధ్య కార్మికుల పనితీరుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు. ఉదయం తెల్లవారుజామున నుండి కష్టపడి వాడవాడలా చెత్తను ఏరువేస్తూ ఎక్కడ కూడా నగరంలో అపరిశుభ్రంగా చెత్త చెదారం లేకుండా ఉండటంలో నిజామాబాద్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ల గొప్పతనానికి నిదర్శనం అన్నారు. అనంతరం వంద రోజుల్లో కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని ఆయా డివిజన్లో అద్భుతంగా పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆయన సన్మానించారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు సిబ్బంది అందరూ కలిసి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను శాలువాతో సత్కరించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >