Posted on 2025-09-03 18:23:04
డైలీ భారత్, ముస్తాబాద్: భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10,000/- రూల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ ఈరోజు తీర్పు వెల్లడించినట్లు ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు.
ఈసందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ…
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సదిమెల రామచంద్రం తన భార్య కనకవ్వను తరచూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని తెలిపారు. మద్యం సేవించి గొడవలు పెట్టడంతో పాటు 2016 డిసెంబర్ 2న ఉదయం 6 గంటల సమయంలో భార్యను దారుణంగా కొట్టాడని, టార్చ్లైట్తో దాడి చేసి గాయాలు చేశాడని తెలిపారు.వేధింపులు భరించలేక బాధితురాలు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడు సదిమెల రామచంద్రం పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం అప్పటి ఎస్.ఐలు చిట్టిబాబు, ప్రవీణ్ చార్జ్షీట్ దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించగా, ఎస్.ఐ గణేష్, సీఎంస్ ఎస్.ఐ శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ తో పాటు 12 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.నిందితుడు రామచంద్రంపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ప్రవీణ్ మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్.ఐ గణేష్ తెలిపారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >