డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి వరద నీరు పోటెత్తడంతో మొత్తం 25 వరద గేట్లను అధికారులు తెరిచారు. బుధవారం ఉదయం 10 గంటలకు 8 గేట్లు ఓపెన్ చేసిన అధికారులు మధ్యాహ్నం 12 గంటలకు మరో 9 గేట్లు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. 25 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ ఫ్లోగా 50 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా 1,30,392 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
News
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తివేసిన అధికారులు.. లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల