డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్హులైన వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించాలని, కొత్త రేషన్ కార్డులను వెంటనే అందించాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చుంచుపల్లి మండల బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి మండల బీజేపీ అధ్యక్షుడు బలగం శ్రీధర్ నేతృత్వం వహించగా, నాయకులు పొనగంటి రాజు, బడే రమేష్, రతన్ లాల్, పెరబోయిన నరసింహరావు, సతీష్, సొప్పరి క్రాంతి, సలీం తదితరులు పాల్గొన్నారు.
News
అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు కేటాయించాలి : బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్