Posted on 2023-12-24 18:17:59
డైలీ భారత్, నారాయణపేట:నారాయణపేట జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఆదివారం సాయంత్రం నారాయణ పేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల ద్వారా సమా చారం అందుకున్న పోలీ సులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
మృతులు కర్నాటక, మహా రాష్ట్ర చెందిన వారిగా గుర్తిం చారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యా యి. యాక్సిడెంట్ కావడం తో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >