| Daily భారత్
Logo




వరుస హత్యల ఘటన: ఐదుగురు నిందితుల అరెస్టు

News

Posted on 2023-12-19 18:24:02

Share: Share


వరుస హత్యల ఘటన: ఐదుగురు నిందితుల అరెస్టు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. నిందితుల వద్ద కారు, బైక్, ఐదు సెల్ఫోన్లు, రూ.30 వేల నగదు, భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదాశివనగర్ పీఎస్లో కేసు ఆధారంగా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.నవంబర్ 29న మాక్లూర్ మండలంలో ప్రసాద్ హత్యకు గురయ్యాడు. మదనపల్లి అటవీ ప్రాంతంలో ప్రశాంత్, వంశీ, విష్ణు అనే ముగ్గురు కలిసి ప్రసాద్ను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ప్రసాద్ జైలులో ఉన్నాడని ఆయన్ని కలుద్దామని చెప్పిఈ నెల 1న ఆయనభార్యశాన్వికనుప్రశాంత్, నిజామాబాద్ తీసుకెళ్లాడు.బాసర వంతెన వద్ద వంశీ, విష్ణుతో కలిసి ఆమెను చంపేసి గోదావరిలో పడేశారు. అదే రోజున ప్రసాద్ చెల్లి శ్రావణిని సైతం తీసుకెళ్లారు. మెదక్ జిల్లా వడియారం వద్ద ఆమెను చంపి తగులబెట్టారు.ప్రసాద్ వద్దకు వెళ్లామని చెప్పి ఆయన తల్లి, పిల్లలు, మరో చెల్లిని కూడా ప్రశాంత్ తీసుకెళ్లాడు. వారిని నిజామాబాద్ లాడ్జిలో ఉంచారు. డిసెంబర్ 4న తమ్ముడితో కలిసి పిల్లల్ని ప్రశాంత్ చంపేసి మెండోర వద్ద సోన్ బ్రిడ్జి వద్ద నీళ్లలో పడేశారు. డిసెంబర్ 13న మరో చెల్లి స్వప్నను సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద చంపి పెట్రోల్ పోసి తగులబెట్టారు. కుటుంబ సభ్యులు రాకపోవడంతో ప్రసాద్ తల్లి సుశీల లాడ్జి నుంచి పారిపోయింది” అని సింధు శర్మవివరించారు. ఆమె కోసం వచ్చినముగ్గురిని అరెస్టు చేసినట్లుచెప్పారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద  ప్రశాంత్ మరో ఇద్దరునిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రసాద్ కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రశాంత్ వద్దలభించాయని ఇప్పటి వరకు 4మృతదేహాలు లభించగా, ప్రసాద్ ఆయన భార్య మృతదేహాలు లభ్యంకాలేదని ఎస్పీ తెలిపారు

Image 1

ప్రతిభ రత్న అవార్డుకు డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-04-23 11:00:59

Readmore >
Image 1

అర్ధరాత్రి ఒంటరి యువతికి రక్షణగా నిలిచిన ఆర్టీసీ బస్సు...

Posted On 2026-04-23 10:06:26

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం... 11మంది సజీవ దహనం

Posted On 2026-04-23 10:03:16

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

Posted On 2026-04-22 22:58:48

Readmore >
Image 1

ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో అక్రమాల ఆరోపణలు

Posted On 2026-04-22 22:55:13

Readmore >
Image 1

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

Posted On 2026-04-22 20:13:36

Readmore >
Image 1

మురికికాలువ త్రవ్వేసి మధురానగర్ రోడ్డు కబ్జా?

Posted On 2026-04-22 20:10:32

Readmore >
Image 1

ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు

Posted On 2026-04-22 12:20:38

Readmore >
Image 1

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం

Posted On 2026-04-22 10:42:24

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మహిళ సీఐ మరియు ఎస్ఐ

Posted On 2026-04-22 07:35:51

Readmore >