Posted on 2025-07-21 11:28:42
డైలీ భారత్, తమిళనాడు:తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఇవాళ (జూలై 21న) ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా కల్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్కు తరలించారు. ఇక, అపోలో హాస్పిటల్ వైద్య బృందం సీఎం స్టాలిన్ ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, స్టాలిన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హాస్పిటల్ వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి.
ఇక, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ బీజీ మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సీఎం స్టాలిన్కు తీవ్ర అస్వస్థత కలిగింది.. కళ్లు తిరగడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నాం.. వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోంది అని వెల్లడించారు. ఈ మేరకు సీఎం ఆరోగ్య పరిస్థితిపై ఆధికారిక హెల్త్ బులెటిన్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
#tamilnadu #stalin
స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం... టాటా ఏసీలో 19 మందిని కూర్చోబెట్టి ప్రయాణం!
Posted On 2026-07-18 16:06:04
Readmore >
డిగ్రీ కాలేజ్ ఎదురుగా అక్రమ మద్యం అడ్డా... లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు
Posted On 2026-07-18 15:41:39
Readmore >
నూతన బాధ్యతలు స్వీకరించిన పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-07-18 15:37:06
Readmore >
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమీక్ష
Posted On 2026-07-18 15:35:33
Readmore >
8 ఏళ్ల తర్వాత కూడా నేరెళ్ల గాయం పచ్చిగానే ఉంది... బాధిత కుటుంబానికి అండగా టిఆర్ఎస్
Posted On 2026-07-18 15:26:59
Readmore >
సిరిసిల్ల జిల్లాలో మొబైల్ షాపులకు కొత్త నిబంధనలు... సమాచారం ఇస్తే ప్రశంసాపత్రం
Posted On 2026-07-18 14:02:57
Readmore >