Posted on 2025-07-14 12:15:35
గుంజె హన్మంతు భార్యకు పోన్ చేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు గుంజె హన్మంతు మృతుపట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గుంజె మృతి వార్త తెలియగానే ఆయన భార్యకు పోన్ చేసి ప్రగాఢసానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గుంజె హన్మంతు మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటన్నాడు. వయస్సును సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కిన గుంజె మానుకోటకు ఐకాన్ గా నిలిచాడని శ్లాఘించారు. లాఠీలకు, తూటాలకు, జైళ్లకు వెరవని గుంజె పోరాట పటిమ భావితరాలకు కరదీపికలాంటిదని అన్నాడు. గుంజె కుటుంబానికి సహాయసహకారాలు అందజేస్తానని అన్నాడు. అనంతరం గుంజె హన్మంతు మృతిపట్ల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఎమ్మెల్యే మురళీ నాయక్ వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు శంతన్ రామరాజు వున్నాడు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >