Posted on 2025-07-13 12:26:59
అన్నదాన కార్యక్రమం నిర్వహణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ముబారక్ నగర్ పరిధిలోని తారక్ నగర్ ప్రాంతంలో ఉన్న పోలేరమ్మ దేవాలయంలో ఉదయం తెల్లవారుజామున నుండి భక్తులు ఆషాడ మాసం, ఊర పండగ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి అభిషేక పూజ, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అదే కాలనీ కి చెందిన యాదవ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమ గల పోలేరమ్మ తల్లి భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి పొందిందని ఆలయ నిర్మాణం చేపట్టిన నుండి తమ తారక నగర్ ప్రాంతంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రాకుండా ఆ పోలేరమ్మ తల్లి కాపాడుతూ వస్తుందని, అలాగే పాడిపంట సమృద్ధిగా చూడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు. అన్నదానం నిర్వహించిన సందర్భంగా భక్తుల నుండి విశేష స్పందన లభించిందని వారు అన్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు రవికుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >