Posted on 2025-05-04 20:40:58
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళ పాడు పంచాయతీ పీకలా తండాలో జరిగింది. వివరాలలోకి వెళితే ఎస్సై జూలూరుపాడు రవి కథనం ప్రకారం, మృతురాలు అయిన గుగులోతు బుల్లి ,భర్త పేరు: పీన ,58 సంవత్సరాలు అను ఆమె తన అన్న అయిన బానోతు కసన ద్విచక్ర వాహనం వెనకాల కూర్చొని పడమటి నరసాపురం వెళ్లి, అచట పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమై ఇంటికి వస్తుండగా, మార్గమధ్యలో రేగళ్ల తండా గ్రామ శివారుణ గల కోళ్ల ఫారం వద్దకు చేరుకునేసరికి, బానోత్ కసన నడుపుకుంటూ వస్తున్న ద్విచక్ర వాహనాన్ని, వెనకాల నుండి కారు అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి ఢీకొనగా కింద పడిపోయిన గుగులోతు బుల్లికి తీవ్ర రక్త గాయాలు కాగా,వెంటనే అచటనున్న స్థానికులు చికిత్స కొరకు ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గత రాత్రి 11:30 గంటల సమయంలో మరణించినది. మృతురాలి కుమారుడు గుగులోతు అప్పు నాయక్ ,తండ్రి పేరు పీన , కారు డ్రైవర్ అయిన బానోతు రవి తండ్రి పేరు :సేవియాపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు ఇవ్వగా ఎఫ్ఐఆర్ నమోదు చేయనైనది.
శ్రీ రామకృష్ణ వైదికధర్మ పీఠం వేద పాఠశాల లో సామూహిక ఉపనయన కార్యక్రమం
Posted On 2026-03-08 21:43:35
Readmore >