Posted on 2025-05-04 20:06:31
డైలీ భారత్, ఖమ్మం న్యూస్: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల అధ్యక్షునిగా ఎస్టీ సమాజ వర్గానికి చెందిన భూక్య రమేష్ ను నియమిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలియచేశారు.
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఎప్పుడూ ముందుంటారని, భూక్య రమేష్ ను భారతీయ జనతా పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులుగా నియమించి సంచలనానికి తెర తీశారని, ఒక గిరిజనుడికి మండలాధ్యక్షుడుగా బాధ్యతలు అప్పగించి తనను తాను నిరూపించుకునే అవకాశం భూక్య రమేష్ కి కల్పించారని, జిల్లా అధ్యక్షులు నిర్ణయాన్ని మండలంలోని కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు.
కష్టపడి పనిచేసే వారిని గుర్తించడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ ముందే ఉంటుందని,దానికి తగ్గట్లే ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నిర్ణయాలు ఉంటాయని, భూక్యా రమేష్ నియామకమే ఇందుకు నిదర్శనమని తెలంగాణా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా అన్నవరపు సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కి ధన్యవాదాలు తెలియజేశారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >