Posted on 2025-04-26 07:46:35
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలున్నాయి.
తాజాగా, ఓ మహిళకు సంబంధించిన కేసు విషయంలో ఆయన ముగ్గురు వ్యక్తులను అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీపీ, ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీపీ కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిపై అయినా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >