Posted on 2025-04-26 07:46:35
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సై లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలున్నాయి.
తాజాగా, ఓ మహిళకు సంబంధించిన కేసు విషయంలో ఆయన ముగ్గురు వ్యక్తులను అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సీపీ, ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీపీ కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతిని సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిపై అయినా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >