| Daily భారత్
Logo




అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

News

Posted on 2025-04-19 07:16:05

Share: Share


అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

డైలీ భారత్, హైదరాబాద్: అమెరికాలో వీసాల రద్దు,స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ రికార్డుల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ తొలగింపులకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని ఏఐఎల్‌ఏ చెప్పింది.

ఇటీవల అమెరికాలో వీసాల రద్దు లేదా స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(సెవీస్‌) రికార్డుల నుంచి తొలగింపునకు గురైన అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది భారతీయులేనని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు, న్యాయవాదులు, యూనివర్సిటీ ఉద్యోగుల నుంచి 327 కేసు నివేదికలను ఈ సంఘం సేకరించింది. ఈ అంతర్జాతీయ విద్యార్థులలో సగం మంది భారతదేశానికి చెందిన వారు కాగా 14 శాతం మంది చైనా విద్యార్థులని ఏఐఎల్‌ఏ ప్రకటించింది. మిగిలిన విద్యార్థులు ప్రధానంగా దక్షిణ కొరియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన వారని గురువారం వెల్లడించింది.

2023-24లో అమెరికాలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులలో అత్యధికులు భారతీయులేనని, మొత్తం 11,26,690 మంది అంతర్జాతీయ విద్యార్థులలో 3,31, 602 మంది (29 శాతం) భారతీయులేనని ఓపెన్‌ డోర్స్‌ డాటా పేర్కొంది. వీరి తర్వాత 2.77 లక్షల మందితో చైనా ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరిలో 50 శాతం మంది విద్యార్థులు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)లో ఉన్నారని, అంటే వీరంతా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారని ఏఐఎల్‌ఏ తెలిపింది. 

ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు 12 నెలలు పని చేసుకోవచ్చు. అదే స్టెమ్‌ కోర్సుల విద్యార్థులైతే మరో 24 నెలలు తమ వీసాను పొడిగించుకోవచ్చు. సెవీస్‌ రికార్డు నుంచి తొలగింపునకు గురైన ఓపీటీ విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు చేసేందుకు వీల్లేదని, ప్రస్తుతం చదివే విద్యార్థులతో పోలిస్తే ఓపీటీ కింద ఉద్యోగాలు చేస్తున్న వారు తమ పాత హోదా పొందడం సాధ్యం కాదని ఏఐఎల్‌ఏ తెలిపింది. 2023-24లో 3.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉండగా వీరిలో 97,566 మంది విద్యార్థులు ఓపీటీలో ఉన్నారని ఏఐఎల్‌ఏ వివరించింది.

అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఏఐఎల్‌ఏ ఆందోళన వ్యక్తం చేసింది. తాము సేకరించిన కేసుల నివేదికలలో 86 శాతం కేసులు ఏదో ఒక స్థాయిలో పోలీసులతో సంప్రదింపులకు నోచుకున్నాయని, 33 శాతం వీసాలు రద్దయిన కేసులలో అభియోగాలు నమోదు చేయకపోవడం, వారిపై కేసులు పెట్టడం లేదని ప్రకటన తెలిపింది.

గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన జోన్‌లో 70 కిలోమీటర్ల వేగంతోడ్రైవ్‌ చేయడం, చట్టవిరుద్ధంగా వాహనం పార్కింగ్‌ చేయడం, సీటు బెల్టు ధరించకపోవడం, నెంబర్‌ ప్లేట్లు గడువు తీరిపోవడం వంటి చిన్న చిన్న అభియోగాలతో పోలీసుల నుంచి ఓపీటీ విద్యార్థులకు నోటీసులు అందాయి. వీసా రద్దుకు గురైన విద్యార్థులలో ఇద్దరు విద్యార్థులకు మాత్రమే రాజకీయ నిరసనలలో పాల్గొన్న చరిత్ర లేదని ఏఐఎల్‌ఏ తెలిపింది. వీసా రద్దుకు సంబంధించిన ఈమెయిర్‌ నోటీసులు అందుకున్న మెజారిటీ విద్యార్థులకు ఈ నోటీసు వీసాను మంజూరు చేసిన కాన్సులేట్‌ నుంచి వచ్చినట్లు ఏఐఎల్‌ఏ పేర్కొంది. 

కాగా, అమెరికాలో వీసాలు రద్దయిన భారతీయ విద్యార్థుల గురించి విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ను గురువారం విలేకరులు ప్రశ్నించగా చాలామంది భారతీయ విద్యార్థులకు నోటీసులు అందిన విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

Image 1

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు

Posted On 2025-05-22 05:22:13

Readmore >
Image 1

దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Posted On 2025-05-21 17:29:16

Readmore >
Image 1

ఏసీబీ వలలో మిషన్ భగీరథ అధికారి

Posted On 2025-05-21 17:28:14

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

Posted On 2025-05-21 17:23:28

Readmore >
Image 1

వర్ధన్నపేట శివారులో కారు బీభత్సం

Posted On 2025-05-21 08:57:24

Readmore >
Image 1

కొండా గట్టుకు బయలేలిన హనుమాన్ స్వాములు

Posted On 2025-05-20 07:26:00

Readmore >
Image 1

చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

Posted On 2025-05-20 07:24:46

Readmore >
Image 1

అల్లుడిని చంపిన కేసులో నిందితుల అరెస్ట్

Posted On 2025-05-20 07:23:32

Readmore >
Image 1

పోస్టర్ ఆవిష్కరణ

Posted On 2025-05-19 14:30:53

Readmore >
Image 1

లష్కరే తొయిబా టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతం

Posted On 2025-05-18 16:45:45

Readmore >