| Daily భారత్
Logo




జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ..

News

Posted on 2025-03-23 22:51:01

Share: Share


జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ..

పది ఎకరాలకు సంబంధించి న్యాయం చేస్తా.

ప్రెస్ క్లబ్ కు స్థలం మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిన పొంగులేటి.

మంత్రిని కలిసిన టియుడబ్ల్యూజే ఐజేయూ నేతలు.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు పై టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు కొత్తగూడెం పర్యటనలో భాగంగా కొత్తగూడెం క్లబ్ కు వచ్చిన మంత్రి పొంగులేటిని టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏర్పుల సుధాకర్, జాయింట్ సెక్రటరీ ఎర్ర ఈశ్వర్, సీనియర్ జర్నలిస్టు (వెలుగు )పోతు రాజేందర్, సుజాతనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ కలిశారు. జర్నలిస్టులకు కేటాయించిన పది ఎకరాల భూమికి సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జర్నలిస్టుల స్థలాలకు సంబంధించి గజానికి 250 రూపాయల చొప్పున ధర నిర్ణయించి అందించాలని ముఖ్యమంత్రికి సిఫారసు విషయాన్ని ఐజేయు నాయకులు గుర్తు చేయడం జరిగింది. అట్టి విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు.. అదేవిధంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ కు సంబంధించి వెంటనే స్థలాన్ని మంజూరు చేస్తానని హామీ ఇస్తూనే పక్కనే ఉన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్  ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యులు పాల్గొన్నారు.

Image 1

స్మశాన అభివృద్ధికి సదర్ సంఘం సమావేశం

Posted On 2026-05-03 18:13:51

Readmore >
Image 1

కామారెడ్డి లో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-03 18:11:11

Readmore >
Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >