| Daily భారత్
Logo




జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ..

News

Posted on 2025-03-23 18:21:01

Share: Share


జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ..

పది ఎకరాలకు సంబంధించి న్యాయం చేస్తా.

ప్రెస్ క్లబ్ కు స్థలం మంజూరు చేయాలని కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిన పొంగులేటి.

మంత్రిని కలిసిన టియుడబ్ల్యూజే ఐజేయూ నేతలు.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు పై టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) ఆధ్వర్యంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం నాడు కొత్తగూడెం పర్యటనలో భాగంగా కొత్తగూడెం క్లబ్ కు వచ్చిన మంత్రి పొంగులేటిని టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకులు జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏర్పుల సుధాకర్, జాయింట్ సెక్రటరీ ఎర్ర ఈశ్వర్, సీనియర్ జర్నలిస్టు (వెలుగు )పోతు రాజేందర్, సుజాతనగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ కలిశారు. జర్నలిస్టులకు కేటాయించిన పది ఎకరాల భూమికి సంబంధించి ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జర్నలిస్టుల స్థలాలకు సంబంధించి గజానికి 250 రూపాయల చొప్పున ధర నిర్ణయించి అందించాలని ముఖ్యమంత్రికి సిఫారసు విషయాన్ని ఐజేయు నాయకులు గుర్తు చేయడం జరిగింది. అట్టి విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు.. అదేవిధంగా కొత్తగూడెం ప్రెస్ క్లబ్ కు సంబంధించి వెంటనే స్థలాన్ని మంజూరు చేస్తానని హామీ ఇస్తూనే పక్కనే ఉన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్  ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు సభ్యులు పాల్గొన్నారు.

Image 1

తిరుమల రెండో ఘాట్ వద్ద కారులో చెలరేగిన మంటలు

Posted On 2025-04-20 08:49:03

Readmore >
Image 1

నార్నె భూముల స్వాధీనం - బాలుడి లేఖతో హైడ్రా యాక్షన్. జూ.ఎన్టీఆర్ మామకు షాక్

Posted On 2025-04-19 19:00:32

Readmore >
Image 1

తెలంగాణలో రాబోయే పది రోజులు మండే ఎండలు

Posted On 2025-04-19 18:24:52

Readmore >
Image 1

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర

Posted On 2025-04-19 18:23:45

Readmore >
Image 1

బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి విశ్వహిందూ పరిషత్ డిమాండ్

Posted On 2025-04-19 18:21:12

Readmore >
Image 1

జూలూరుపాడు ఇంచార్జ్ గ్రామపంచాయతీ సెక్రటరీ హరిబాబు సన్మానించిన మల్టీపర్పస్ వర్కర్స్ మండల నాయకులు

Posted On 2025-04-19 16:29:52

Readmore >
Image 1

ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

Posted On 2025-04-19 15:58:50

Readmore >
Image 1

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. నలుగురి మృతి

Posted On 2025-04-19 07:22:41

Readmore >
Image 1

అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!

Posted On 2025-04-19 07:16:05

Readmore >
Image 1

సరికొత్త అప్‌డేట్స్‌తో అపాచీ RR 310

Posted On 2025-04-19 07:14:31

Readmore >