Posted on 2025-03-20 09:10:44
ప్రభుత్వడిగ్రీ కళాశాల అటానమస్ , పాల్వంచ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ అటానమస్ హిందీ విభాగం విద్యార్థులు ఆకాశవాణి కొత్తగూడెం యువ వాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.కె రేష్మ థర్డ్ బీకాం మహిళల హక్కులు,చట్టాలు అనే అంశంపై మాట్లాడుతూ, మహిళల హక్కులను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడవచ్చునని, మహిళలు తమ హక్కులను తెలుసుకోవడం ద్వారా శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చునని తెలియజేసినారు. అనంతరం ఎస్ లావణ్య థర్డ్ బి జెడ్ సి హిందీ మహిళా సాహిత్యకారులు అనే అంశంపై మాట్లాడుతూ మహిళా రచయితలు సమాజంలోని మహిళల వివిధ సమస్యలను, జీవితాలను, భావోద్వేగాలను తమ రచనల ద్వారా తెలియజేసి మహిళలను చైతన్యవంతులను చేసినారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన హిందీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ టి అరుణ కుమారి, సహనాజ్ లను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి పద్మ మరియు ఇతర అధ్యాపక బృందం అభినందించినారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >