Posted on 2025-02-07 08:22:18
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహణ
డైలీ భారత్ ,ఖమ్మం:ఖమ్మం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందించుటకు ప్రత్యేక ఎంపిక శిబిరాలను ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఫిబ్రవరి 10న ఖమ్మం ఎన్ఎస్పి క్యాంప్ రోడ్డులోని రోటరీ క్లబ్ లో ఫిబ్రవరి 11న సత్తుపల్లి లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఫిబ్రవరి 12న మధిర రైతు వేదికలో ఫిబ్రవరి 13న వైరా రైతు వేదికలో ఫిబ్రవరి 14న పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం గురువైగూడెం రోడ్డు కూసుమంచి రైతు వేదికలో ప్రత్యేక ఎంపిక శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రత్యేక ఎంపిక శిబిరాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయని అన్నారు. వయోవృద్ధులకు చేతి కర్రలు వాకర్స్ వినికిడి యంత్రాలు అలాగే శారీరక దివ్యాంగులకు అవసరమగు చార్జింగ్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, కాలిపర్ కృత్రిమ అవయవాలు అలింకో సంస్థ నిపుణుల సహకారంతో అర్హులకు అందజేయడం కోసం ఎంపిక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్ పొందుటకు 16 సంవత్సరాలు పైబడి 80 శాతం వైకల్యం ఉన్నవారు వయో వృద్ధులు సంవత్సర ఆదాయం లక్షా 80 వేలు, శారీరక దివ్యాంగులు 2 లక్షల 70 వేలు ఆదాయం మించకుండా ఉండాలని, శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు వయస్సు ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో బిపిఎల్ రేషన్ కార్డు వైకల్యం ధృవీకరణ పత్రం వెంట తీసుకొని రావాలని అర్హత వైకల్యం గల దివ్యాంగులు మాత్రమే హాజరు కావాలని అర్హత లేని శారీరక దివ్యాంగులు ఇతర కేటగిరి దివ్యాంగులు వచ్చి క్యాంపు వద్ద ఇబ్బంది పడవద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >