డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రవీంద్రభారతిలో 3 జనవరి 2025న నిర్వహించనున్న సావిత్రీబాయి ఫూలే 194 వ జయంతుత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బిసి వుమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా కొండా సురేఖని సెక్రటేరియల్ లోని వారి కార్యాలయంలోని కలిసి ఆహ్వానించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను వారు మంత్రి సురేఖకి వివరించారు. మహిళల సంక్షేమానికి, సాధికారతకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తద్వారా వారి జీవితాల్లో వస్తున్న పురోగతిని వారు మంత్రి సురేఖ కి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నదని మంత్రి సురేఖ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు.
News
రవీంద్రభారతిలో సావిత్రీబాయి ఫూలే 194వ జయంతి ఉత్సవాలు