డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి.గురువారం ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవలకు కృషిచేసి ప్రజల ఆశీర్వాదాలు పొంది నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతునితో కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు.విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ప్రోత్సహించాలని వారిని కోరారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పథం వైపు నడిపేందుకు వారికి దేవుడు పూర్తిస్థాయి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
News
వేం నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి