ఎమ్మార్వో ఆఫీసు ముందు పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం.
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి - పెద్ద కొడప్గల్ మండలం వద్లం గ్రామానికి చెందిన రైతు అంజయ్య పట్టాదారు పాసు పుస్తకం కోసం ఆర్ఐ పండరికి రూ. 20 వేలు ఇచ్చాడు.అయినా పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తహసీల్దార్ ఆఫీసులో ప్రజావాణి జరుగుతుండగా రైతు అంజయ్య పురుగుల మందు తాగాడు.అడ్డుకున్న అధికారులు రైతు అంజయ్యను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.