Posted on 2023-11-02 10:22:55
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల :రేపటి నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పక్రియ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆనంద్ కుమార్,అదనపు ఎస్పీ చంద్రయ్య పోలీస్ అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ....
రేపటి నుండి ప్రారంభమగు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్,కేంద్ర బలగాలతో పటిష్ట భద్రత,సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.నామినేషన్ ల దాఖలుకు అభ్యర్థితో పాటు 5 గురికి ( 1 +4) కు మాత్రమే అనుమతి ఉంటుందని,ఐదుగురు కంటే ఎక్కువ మందికి లోపలికి పర్మిషన్ లేదు.నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుండి కేవలం 3 వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకారం అందించాలన్నారు.
ఎస్పీ గారి సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి, టౌన్ సి.ఐ ఉపేందర్, MRO షరీఫ్ మోహినుద్దీన్ ఉన్నారు.
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >
గంజి శ్రీదేవి శ్రీనివాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం
Posted On 2026-03-31 10:55:55
Readmore >
కామారెడ్డి ప్రీమియర్ లీగు : ఆన్లైన్ బ్రాడ్ కాస్టింగ్ కోసం రూ.1.20 లక్షల విరాళం
Posted On 2026-03-31 10:54:41
Readmore >
హనుమాన్ జయంతి ర్యాలీ మార్గాన్ని స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
Posted On 2026-03-31 10:53:12
Readmore >
కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Posted On 2026-03-31 08:48:45
Readmore >