Posted on 2024-07-26 14:58:59
శ్రీను నాయక్ ను సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదివాసి గిరిజన విభాగం రంగారెడ్ది జిల్లా చైర్మన్ గా షాద్ నగర్ అసెంబ్లీకి చెందిన శ్రీను నాయక్ నియమితులయ్యారు. శుక్రవారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను శ్రీను నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీను నాయక్ ను శాలువాతో సన్మానించి అభినందించారు. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా గిరిజన ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వారికి చేరువ చేయాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. గిరిజనుల సంక్షేమం అభివృద్ది విషయంలొ ప్రభుత్వానికి వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. స్థానికంగా గిరిజనులను చైతన్యవంతులు చేయడంలో శ్రీను నాయక్ పాత్ర గొప్పదని ఎమ్మెల్యే అభినందించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులను ఏకతాటిపైకి తెచ్చినందుకు శ్రీను నాయక్ కు ఈ పదవి ఇవ్వడం ఎంతైనా సముచితమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా శీను నాయక్ మాట్లాడుతూ తనపై పెట్టిన గురుతరమైన బాధ్యతను బాధ్యతగా భావించి అందరికీ న్యాయం చేస్తానని పేర్కొన్నారు. గిరిజన జాతి అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సంక్షేమ ఫలాలను వారికి అందే విధంగా తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తనకు రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా అవకాశం కల్పించిన గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >