| Daily భారత్
Logo




తమ భూమిని ఇతరులు కబ్జా చేశారని ప్రజావాణిలో మహిళల ఆత్మహత్య యత్నం?

News

Posted on 2024-07-22 20:16:56

Share: Share


తమ భూమిని ఇతరులు కబ్జా చేశారని ప్రజావాణిలో మహిళల ఆత్మహత్య యత్నం?

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వంశ పర్యపారంగా వచ్చిన తమ భూమిని ఇతరులు కబ్జా చేశారని,దీనిపై రెవిన్యూ కార్యాలయం చుట్టూ గత కొన్నేళ్లుగా తిరుగుచున్నపటికి తమకి న్యాయం జరగడం లేదని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామనికి చెందిన ఎస్టి మహిళ మేడం అరుణ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని తమ గోడును వెళ్లబోసు కున్నారు.

కలెక్టరేట్ లో ప్రతి సోమ వారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేం దుకు వచ్చిన వారు కలెక్టర్ కీ పిర్యాదు చేయడానికి ముందే తమ వెంట తెచ్చు కున్న పెట్రోల్ ని ముగ్గు రు.మహిళలు పోసుకునే క్రమంలో అక్కడున్న పోలీసులు సిబ్బంది చూసి వారిని అడ్డుకున్నారు.

వారి తాతల పేరున మొత్తం 10 ఎకరాల భూమి ఉంద ని,అందులో 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఉందని, సర్వే నంబర్ 190/24 లో పహానీ ఉండగా అది కూడా మా పక్కనే ఉన్న భూతరాజు రామారావు, భూతరాజు రాజీమా భూమిని కబ్జా చేశారు. అని వాపోయారు.

వారి పేరుమీద ఉన్న భూమిని  నడిగూడెం ఎం.ఆర్.వో నరసింహారావు వారికి దొంగ పట్టా చేసి పాస్ బుక్ ఇచ్చారని అన్నారు. మా పేరుమీద ఉన్నప్పుడు ఇలా దొంగపట్టాలు ఏ రకంగా ఎం.ఆర్.వో చేస్తాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.

మా భమి మీరు ఎలా పట్టా చేసుకుంటారని అడిగితే ఎం.ఆర్.ఓ నర్సింహరావు చేశారు అని భూతరాజు రామారావు చెప్పారు అన్నారు.తామూ పొట్టకూటి కోసం ఊరు వదిలి వెళ్లి వచ్చే సరికి తమ భూమి లేదని కన్నీరు మున్నీర య్యారు.

దీనిపై గతంలో స్థానిక ఎమ్మార్వోనీ కలిసినప్పటి ఫలితం లేకపోయిందని ఆరోపించారు.ఇదిలా ఉండగా సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన అవుట నాగయ్య అనే రైతు గత కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి నా భూమిని బలవంతంగా లాక్కొని సర్వే నంబర్ 836 లో గల 2 ఎకరాల 11 గంటల నా భూమిలో బోర్డు పెట్టు నన్ను రానివ్వడం లేదని వాపోతూ తన వెంట తెచ్చుకున్న మందు డబ్బాను తీయబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

మాకు మా భూమి కావాలి. మా బతుకుదెరువు మా భూమే అని మా భూమిని మాకు ఇప్పించి పాసుబు కలు ఇప్పించాలని కోరా రు.ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు ఇప్పించక పోతే మాకు చావే శరణ్యం అని అన్నారు.

ఎన్నిరోజులు ఇలా దేశాలు పట్టుకొని తిరగాలి మేము భూమి చేసుకొని బతుకు తం ఇక తిరిగి తిరిగి ఇసుగొ చ్చింది, మాకు న్యాయం చేయకపోతే మేము కలెక్టరేట్ కార్యాలయం ముందే చచ్చిపోతాం మాపై దయదలచి మా భూమిని మాకు ఇప్పించాలని కలెక్టర్ ని వేడుకున్నారు.

Image 1

పునరుద్ధరించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించిన డీజీపీ

Posted On 2026-03-01 18:26:22

Readmore >
Image 1

మాందాపూర్ గ్రామ పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ సంబరాలు

Posted On 2026-03-01 18:19:42

Readmore >
Image 1

వార్డ్ బాట పట్టిన 14వ వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-03-01 18:18:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-01 10:40:53

Readmore >
Image 1

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం

Posted On 2026-03-01 06:50:29

Readmore >
Image 1

సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

Posted On 2026-02-28 21:44:48

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామం : బుడియా బాపు జాతర కార్యక్రమం

Posted On 2026-02-28 21:39:40

Readmore >
Image 1

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

Posted On 2026-02-28 20:49:58

Readmore >
Image 1

యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు

Posted On 2026-02-28 20:10:03

Readmore >
Image 1

గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-02-28 19:39:47

Readmore >