Posted on 2024-07-17 20:09:52
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనం కాకపోతే బీజేపీకి బీఆర్ఎస్ బయట నుంచి మద్దతిస్తుందని మీడియాలో ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఈ వార్తలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మాజీ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఒవైసీ కోరారు. తెలంగాణ వచ్చింది.. తెలంగాణ అభివృద్ధి చెందింది.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.. కానీ, ప్రశ్న ఏమిటంటే.. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా..? లేదా మద్దతిస్తుందా..? అనేది నాకు తెలియదు.. కాగా కొన్ని ప్రముఖ పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి.. అందులో మాజీ ఎంపీ వినోద్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అంటూ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఈ విషయంలో తనను ఎప్పుడైనా విమర్శించొచ్చన్న అసదుద్దీన్ ఒవైసీ.. మీడియాలో వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ స్పందించాలని మరోసారి ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్బ్యాగ్లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >