డైలీ భారత్, చంద్రంపేట: జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చంద్రంపేట ఉన్నత పాఠశాలలో చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు వైద్యాధికారిని శ్రావణి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరముల పిల్లలు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు.నులి పురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత , పౌష్టికాహార లోపం , బలహీనత , కడుపునొప్పి లక్షణాలు ఉంటాయని అన్నారు. అందుకే ప్రతి ఒక్క చిన్నారి అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎం అనిత, ఆశ భూలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు మరియు చిన్నారులు పాల్గొన్నారు.