ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
ఈ నెలాఖరి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం
రైతుల అధైర్య పడొద్దు అండగా ఉంటం
డైలీ భారత్, మెదక్:స్థానిక పాపన్నపేట మండలంలోని కొడపాక గ్రామo లో దాన్యం కొనుగోలు సెంటర్ ను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొలుగోలులో రైతుల అధైర్య పడద్దని రైతులకు అండగా ఉంటామని, ధాన్యం చివరి గింజ వరకు కొంటామని, . జిల్లాలో ధాన్యం సేకరణ ఈనెల ఆఖరి వరకు పూర్తి చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలులో రవాణా కోసం ఇతర జిల్లాల నుంచి అదనపు వాహనాలు తెప్పించామని, అదనపు వాహనాలలో లోడింగ్ నడుస్తుందన్నారు. దళారులను నమ్మొద్దని, కొనుగోలు కేంద్రంలో అన్ని సౌకర్యం కల్పించామన్నారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.