| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మళ్లీ తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత

మళ్లీ తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో ఎంఎల్‌ సి కవిత జ్యుడీషియల్ కస్ట డీ పొడిగించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ మరో 14 రోజుల పాటు పొడిగిం  చారు. మే 7 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిం చింది.

ఇదే ఢిల్లీ మద్యం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కూడా మే 7వరకు పొడిగించింది. ఇడి కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.

ఇడి తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఇడి తరుఫు న్యాయవాది జోయబ్ పేర్కొన్నారు.

కవిత అరెస్టు చట్టబద్ధంగానే జరిగిందని ఇడి తరుఫు న్యాయవాది వివరించారు. సెక్షన్ 19 అనుగుణంగానే కవిత అరెస్టు జరిగిందని వెల్లడించారు.

ఏప్రిల్ 11న కవితను సిబిఐ తీహార్ జైలు నుంచి అరెస్ట్ చేసింది. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీ తీసు కుని విచారించింది. ఆతర్వా త కోర్టులో ప్రవేశపెట్టగా.. తొమ్మిది రోజుల పాటు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలిం చారు...

Previous అంగన్వాడీ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం : సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ
Next భార్యను కాపురానికి రానివ్వడం లేదని అత్తను గొడ్డలితో హత్య చేసిన అల్లుడు
ADVERTISEMENT