డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ను శాలువాతో సత్కరించారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్తో చర్చించినట్లు తెలుస్తోంది. చేవెళ్లకు సీడీపీ నిధులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని ఇటీవల విన్నవించారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.
News
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య