| Daily భారత్
Logo




అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

News

Posted on 2024-02-28 17:27:41

Share: Share


అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

వారికి మట్టి కావాలి మాకు డబ్బులు కావాలి 

అధికార పరిపాలన అయితే మాకేంటి ప్రభుత్వం అయితే మాకేంటి

వెలుగులోకి రహస్యాలు తీసుకొస్తే జర్నలిస్టులపై కేసులు దాడులు

డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లాలో నుండి వివిధ మండలాలలో చేగుంట, తూప్రాన్‌, వెల్దుర్తి, శివ్వంపేట, నర్సాపూర్‌, హవేలిఘనపూర్‌, పాపన్నపేట, టేక్మాల్‌, మనోహరాబాద్‌ జిల్లాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా, అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, వెంచర్ల ఏర్పాటుకు మట్టి వినియోగం తప్పనిసరి కావడంతో ఈ దందా జోరుగా కొనసాగుతోంది. నిబంధనలు ప్రకారం తవ్వకాలు జరపాలంటే మైనింగ్‌, రెవెన్యూ శాఖల అధికారుల అనుమతి తీసుకోవాలి. అయితే ఇవేవీ లేకుండానే కొనసాగిస్తున్నారు.

తరుగుతున్న గుట్టలు

టేక్మాల్‌ రామేశ్వర గుట్ట, ఎల్లంపల్లి చిన్నగుట్ట నుంచి, కాదులూర్‌, వెంకటాపూర్‌, బొడ్మట్‌పల్లి శివారు నుంచి వెంచర్లకు, నూతనంగా నిర్మించే ఇళ్లకు తరలిస్తున్నారు. శివ్వంపేట మండలం నవాబ్‌పేట, సికింద్లాపూర్‌, రూప్లాతండా చెరువులు, కుంటల్లో  తవ్వకాలు జరపడంతో గుంతలు పడ్డాయి. పాపన్నపేట మండలం పాపన్నపేట, నామాపూర్‌, అర్కేల, లక్ష్మీనగర్‌, మిన్పూర్‌ల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. తూప్రాన్‌ మండలం నాగులపల్లి, జెండాపల్లి, బ్రాహ్మణపల్లి, వెంకటాపూర్‌ల్లో చెరువుల నుంచి రాత్రి సమయంలో మట్టిని తవ్వి తరలిస్తున్నారు.  మనోహరాబాద్‌ మండలం కూచారం, రంగాయపల్లి, కాళ్లకల్‌లోనూ  ఇదే పరిస్థితి నెలకొంది.


వెంచర్లకు తరలిస్తూ

నర్సాపూర్‌ పట్టణం పరిధిలోని హనుమంతపూర్‌ అసైన్డ్‌ భూముల నుంచి పెద్ద ఎత్తున మట్టిని వెంచర్లకు తరలిస్తున్నారు. రైతులకు నామమాత్రపు నగదు చెల్లించి యంత్రాలతో తవ్వకాలు జరపడంతో లోతైన గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని కొండలను తవ్వేస్తున్నారు. నార్సింగి మండలం మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తవ్వుతూ వెంచర్లకు తీసుకెళ్తున్నారు. చేగుంట మండలంలోని  వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటల నుంచి తరలిస్తున్నారు. హవేలిఘనపూర్‌ మండల కేంద్రంతో పాటు బూర్గుపల్లి, శమ్నపూర్‌, తదితర గ్రామాల్లో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టిని అరికట్టాలని భూగర్భ జలాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >