Posted on 2024-02-28 18:20:05
భూ కబ్జాలకి సంబంధించిన సమస్యలపై జిల్లా ప్రజలు ధైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయండి.
అమాయక ప్రజల బెదిరింపులకు గురి చేసి వారి భూములను కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,
డైలీ భారత్, తంగళ్ళపల్లి: ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...తంగళ్ళపల్లి మండలానికి చెందిన గజభింకర రాధాబాయీ w/o బాలాజి 1996 సంవత్సరంలో భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇటీవల తOగళ్లపల్లి కి చెందిన పెద్దూరు తిరుపతి అనే వ్యక్తి రాధాబాయీ కి చెందిన 20 గుంటలు భూమిని బెదిరించి ఆక్రమించుకున్నాడు. రాధా భాయ్ ఇచ్చిన పిర్యాదూ మేరకు పెద్దూరు తిరుపతి మీద తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రోజున రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
జిల్లా పరిధిలో భూ కబ్జాలకి సంబంధించిన, నకిలీ భూ పత్రాలు సృష్టించి బేధరింపులకు పాల్పడిన వారి వివరాలు , నెరప్రవృతి గురించి నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చు అని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,అమాయక ప్రజలను బెదిరిస్తూ, బయబ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >