Posted on 2024-02-24 21:46:17
డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు. ధరణి పోర్టల్ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారని అధికారులను సీఎం ప్రశ్నించారు.
లక్షలాది రైతుల భూరికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారన్నారు సీఎం. గోప్యంగా ఉండాల్సిన లక్షలాది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, భూ రికార్డులు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని సీఎం ప్రశ్నించారు.
ధరణిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్ది ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలోగా అన్ని మండాల కేంద్రాల్లో పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణి కమిటీ సూచలను పరిగణలోనికి తీసుకుని విధివిధనాలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పగా వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >
హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..
Posted On 2026-05-04 18:53:54
Readmore >