మహబూబ్ నగర్ జిల్లాలో చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురు మృతి
డైలీ భారత్, మహబూబ్ నగర్ జిల్లా:మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ (M) అన్నసాగర్ వద్ద NH -44పై ఈరోజు మధ్యాహ్నం
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ప్యామీలి ఎస్సై తో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను ఎస్సై వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్రగా గుర్తించారు. ఎస్సై వెంకటరమణ కుమార్తె అనూషకు తీవ్రగాయాలు అయ్యాయి.
దీంతో మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో అనూషకు చికిత్స అందిస్తున్నారు...