Posted on 2026-09-03 09:21:29
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఎదుట గురువారం BRS నాయకులు, రైతులు సంయుక్తంగా భారీ నిరసన చేపట్టారు.
వరి నాట్లు వేసిన రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారని నాయకులు ఆరోపించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే రైతులు తమ చెప్పులను క్యూలైన్లలో పెట్టి బస్తాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ఫోన్ ఆన్లైన్ బుకింగ్ విధానంపై రైతులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆన్లైన్ వాడకం తెలియని నిరుపేద, వృద్ధ రైతులు యూరియాను ఎలా బుక్ చేసుకోవాలని ప్రశ్నించారు. బుక్ చేసినా యాప్లో జీరో స్టాక్ చూపిస్తోందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ, "ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమయ్యాయి? రైతే ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది" అని వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్క రైతుకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మండలం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
#Ellareddypet #UreaShortage #Sircilla #BRSProtest #RevanthReddy #TelanganaFarmers
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >