| Daily భారత్
Logo




ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలి-మోతె రాజిరెడ్డి

News

Posted on 2026-06-09 14:05:48

Share: Share


ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలి-మోతె రాజిరెడ్డి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహంపై నల్లగొండలో కొందరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడాన్ని తెలుగుదేశం పార్టీ వేములవాడ నియోజకవర్గ అడహాక్ కమిటీ సభ్యులు & టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా  మోతె రాజిరెడ్డి  మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి ఇలా చేయడం తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కో లేకపోవడం లాంటి పిరికిపందల చర్యగా మోతె రాజిరెడ్డి వ్యాఖ్యానించారు.తక్షణమే ఈ కుట్రకు పాల్పడిన దుండగులను గుర్తించి క్రిమినల్ చర్యలతో పాటు కఠినంగా శిక్షించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని ఆయన అన్నారు. నల్లగొండలో కొందరు దద్దమ్మల పిరికి చర్యల వలన తెలుగుదేశం పార్టీ భయపడదని చంద్రబాబు నాయుడు లోకేషులను అభివృద్ధిలో ఎదుర్కోలేని పిరికిపందలు చేతకాని దద్దమ్మలు కుట్రలకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని ప్రపంచ దేశాలకు తెలుగుజాతి గౌరవాన్ని సాటి చెప్పిన మహనీయుడి విగ్రహానికి నిప్పు పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మోతె రాజిరెడ్డి కోరారు..

Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : పోక్సో కేసులో సంచలన తీర్పు

Posted On 2026-06-09 16:40:18

Readmore >
Image 1

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలి-మోతె రాజిరెడ్డి

Posted On 2026-06-09 14:05:48

Readmore >
Image 1

"మానసిక వ్యాధులు"( సైకియాట్రిక్ డిసార్డర్స్)

Posted On 2026-06-07 20:05:25

Readmore >
Image 1

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

Posted On 2026-06-07 13:06:00

Readmore >
Image 1

ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-07 13:04:42

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >