వీటికి దారులైన మిల్లర్లపై, ఎం.ఎల్.ఎస్ పాయింట్ ఇంచార్జ్ లపైన పెట్టిన ఆర్ ఆర్ ఆక్ట్ కు సంబందించిన చర్యలు సత్వరమే తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
డైలీ భారత్, మెదక్:సోమవారం కలెక్టర్ చాంబర్ లో రెవిన్యూ సివిల్ సప్లై అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా లక్ష్మి నర్సింహా రైస్ మిల్, నర్సాపూర్ శ్రీధర్ గుప్తా రైస్ మిల్, మాసాయిపేట చైతన్య ఆగ్రో, పాపన్నపేట భవాని రైస్ మిల్, రామాయంపేట భవాని రైస్ మిల్లర్లు , సిఎంఆర్ లు ఇవ్వకుండా బకాయిలు పడ్డ వారిపై ఆర్ ఆర్ ఆక్ట్ ప్రకరాం సత్వరమే చర్యలు తీసుకోవాలని , స్థిర చర ఆస్తుల వివరాలు సేకరించి వారి ఆస్తుల జప్తుకు, ఎమ్ ఎల్ ఎస్ పాయింట్ గోదాములలో బియ్యం అవకతవకలకు పాలు పడిన సిబ్బంది పై RR ఆక్ట్ ప్రకారం తాకీదు సిద్ధం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , డి యం సివిల్ సప్లైయి హరికృష్ణ , డి సి ఎస్ ఓ బ్రహ్మరావు , ఆర్ డి ఓ లు శ్రీనివాస్ , జయచంద్ర , అంబదాస్ రాజేశ్వర్ ,తహసీల్దార్లు , సిబ్బంది పాల్గొన్నారు