Posted on 2026-05-29 12:17:49
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్ను సందర్శించి ధాన్యం దిగుబడి తీరును పరిశీలించారు. మిల్లుకు చేరుతున్న ధాన్యం నాణ్యత, తూకం ప్రక్రియ, నిల్వ విధానం, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిపై ఆరా తీశారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే అన్లోడింగ్ చేసి మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. అకాల వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ధాన్యం దిగుబడి శాతం, రికవరీ వివరాలు, సీఎంఆర్ లక్ష్యాల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన బియ్యాన్ని నిర్దేశిత గడువులోగా అందజేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, DM శ్రీకాంత్, రైస్ మిల్లర్లు,సంబంధిత అధికారులు, మిల్ యాజమాన్యం పాల్గొన్నారు.
బీబీపేట్ మండలం లోని మహేశ్వరి రైస్ మిల్లో ధాన్యం దిగుబడి తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-05-29 12:17:49
Readmore >
సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య
Posted On 2026-05-28 21:35:53
Readmore >
కామారెడ్డిలో అంతరాష్ట్ర కిడ్నాప్ ముఠా కలకలం... అక్రమ తుపాకీతో వ్యాపారవేత్త కిడ్నాప్కు స్కెచ్!
Posted On 2026-05-28 20:21:50
Readmore >
గాలి వర్షానికి నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-28 18:25:02
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ ఓ పి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-05-28 18:18:15
Readmore >
35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ ద్వారా పారదర్శక బదిలీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-05-28 10:04:11
Readmore >