Posted on 2026-05-27 14:44:38
కనీస వేతనం నెలకు 26 వేలు చెల్లించాలి
గ్రామ దీపీకలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత
గ్రామ దీపీకల దీక్షలకు ఐద్వా సంఘీభావం
డైలీ భారత్, వైరా: దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న గ్రామ దీపీకల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత అన్నారు. కనీస వేతనం నెలకు 26000 వేలకు పెంచాలని, అర్హులైన గ్రామ దీపికలకు సీసీగా పదోన్నతి కల్పించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, జీవో నెంబర్ 58 సవరించాలని పలు సమస్యల పరిష్కారం కోసం గ్రామ దీపీకలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6 రోజుకు చేరుకున్నాయి. బుధవారం గ్రామ దీపీకల దీక్షా శిబిరాన్ని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, డివిజన్ నాయకురాలు కంసాని మల్లికాంబ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి
డిమెట్ల రజిత మాట్లాడుతూ కనీస వేతనం 26 వేలుకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ దీపీకలు చేస్తున్న పోరాటానికి ఐద్వా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. గ్రామ దీపికలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సమాఖ్యల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడం వంటి బాధ్యతలను గ్రామ దీపీకలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గ్రామ దీపికలకు తగిన వేతనాలు ఇవ్వకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ దీపికల సమస్యలను పరిష్కరించాలి. వేతనాలను పెంచడంతో పాటు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్థిరమైన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి.ఓ. యూనియన్ అధ్యక్షురాలు పద్మావతి, కార్యదర్శి శైలజ, ఉపాధ్యక్షురాలు బబిత, షేక్. షైనాబి, ప్రభావతి, నిర్మల, మమతా, తేజ ప్రభావతి సంజు, రమాదేవి రాధా, మణి, మల్లీశ్వరి, విజయలక్ష్మి, స్రవంతి గద్దె నీరజ, మేరీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >