Posted on 2026-05-27 16:31:01
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో గత తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వేములవాడ అర్బన్, రూరల్ మండలాల ఐకేపీ, వివోఏల ఆందోళనకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, వారికి 20 వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వారికి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు, విధుల నిర్వహణకు అవసరమైన ట్యాబ్ మరియు నెట్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతులు కల్పించాలని మరియు జీవో 58ను సవరించాలని వివోఏలు చేస్తున్న న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఏశ తిరుపతి, సర్పంచులు ఊరడి సునీత-రాజిరెడ్డి, ముత్త సంజన-మహేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హన్మాండ్లు, మాజీ సర్పంచ్ సుమన్, దేవరాజు, గోపు మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-05-27 16:58:02
Readmore >
ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:43:06
Readmore >
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-05-27 16:39:20
Readmore >
కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:35:33
Readmore >
వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
Posted On 2026-05-27 16:31:01
Readmore >
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >