Posted on 2026-05-27 13:53:04
పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్నాం.. పదవులు మాత్రం వలస నేతలకేనా..?
దళిత బంధు లబ్ధిదారులకు పదవులు.. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు నిరాశ.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని మరిచారా..?
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన సీనియర్ దళిత నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ దళిత నాయకుడు మంద బాబు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకులు ప్రస్తుతం పార్టీపై ఆధిపత్యం చెలాయిస్తూ పదవులు పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో తాము పార్టీ కోసం పస్తులు ఉండి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ కేసులు ఎదుర్కొన్నామని తెలిపారు. పార్టీ బీఫారం ఇచ్చిన అభ్యర్థుల గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన తమలాంటి నాయకులకు సరైన గౌరవం దక్కడం లేదని అన్నారు.
పార్టీ కోసం పని చేయని కొందరు నాయకులు పైస్థాయి నేతల అనుగ్రహంతో పదవులు పొందుతున్నారని ఆరోపించారు. వలస వచ్చిన నాయకులకు ఎస్సీ సెల్ పదవులు అప్పగిస్తూ సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులను అవమానపరుస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పార్టీ అధిష్టానం స్పందించి నిజాయితీగా పనిచేసిన సీనియర్ దళిత నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. లేకపోతే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >