Posted on 2026-05-11 17:12:59
డైలీ భారత్, సిరిసిల్ల: మతసామరస్యాన్ని కాపాడుతూ, ఇతరుల మనోభావాలకు కించపరచకుండా పండుగల నిర్వహణ చేపట్టాలని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో హిందూ సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ...శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని,అపోహలు, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న పోలీసు శాఖకు తెలియజేయాలని తెలిపారు. సొంతంగా వాహనాలను ఆపడం తనిఖీలు చేయడం లాంటివి వద్దని తెలిపారు.సోషల్ మీడియా పోస్టులు చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే డయల్ 100 ద్వారా లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్సీఎస్టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >