Posted on 2026-04-13 12:48:09
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ సాయి అపార్ట్ మెంట్ లో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి. అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే బాలకృష్ణ రాజంపేట ఎంపీడీవోగా పనిచేస్తు న్నారు. బాలకృష్ణ తన కుటుంబంతో కలిసి ఆస్పత్రి పనిమీద ఫ్లాట్ కు తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. శుభకార్యాల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. 40 తులాల బంగారం, 60తులాల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం బృందాలు వివరాలు సేకరించాయి. పోలీసులు అపార్ట్మెంట్, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ నరహరి తెలిపారు.
బాలకృష్ణ బాధితుడు
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >