డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్ : ఇవాళ్టి నుంచి అయోధ్య లోని బాలరాముని దర్శనం కలగనుంది. 24 అడుగుల దూరం నుంచి సాధార ణభక్తులు బాలరాముని దర్శనం చేసుకోనే అవకాశం. సమయాలను రెండు స్లాట్లుగా విభజన చేశారు.
ఉదయం 7గంటల నుంచి ఉదయం 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు భక్తులు బాలరాముని దర్శనం చేసుకోవచ్చు.
ప్రతిరోజూ మూడు హారతులు ఉంటాయి. ఉదయం 6.30 గంటలకు శృంగారం హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంది.