Posted on 2026-02-17 16:23:59
డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు నార్కోటిక్ డ్రగ్స్ పైన , పరీక్షలలో ఒత్తిడిని జయించడం పై విద్యార్థులకు అవగాహన సదస్సును ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ నిర్వహించినారు.
తెలంగాణ గురుకుల పాఠశాల బద్దెనపల్లి , మరియు నేరెళ్ల గర్ల్స్ కాలేజ్, కస్తూర్బా బాలికల విద్యాలయం, తంగల్లపల్లి విద్యార్థులకు పరీక్షలపై సానుకూల దృక్పథం డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నం చందర్ మాట్లాడుతూ డ్రగ్స్ లోని రకాలు వాటి వినియోగం వలన కలుగు దుష్పరిణామాలు వివరించారు. వాటిని ఉపయోగించే వారికి దూరంగా ఉండాలనీ పిల్లలకు సూచించారు.
చదువు పట్ల ఏకాగ్రత పెంచుకోవడం పరీక్షల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించుకోవడం ద్వారవపరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. అందుకు అవసరమైన సలహాలను కౌన్సిలింగ్ ద్వారా అందించారు.
అలాగే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు డ్రగ్స్ రహిత తెలంగాణ కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకు మనమందరం సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్, డా. చంద్రిక ,ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బత్తిని రఘు, కానిస్టేబుల్ నరేందర్, హెల్పింగ్ హార్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అల్వాల ఈశ్వర్, ప్రధానోపాధ్యాయులు పాఠశాల బృందం పాల్గొన్నారు.
తిరుపతిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 10 మందికి రూ.1,00,000 జరిమానా
Posted On 2026-02-17 19:35:10
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-17 19:14:45
Readmore >
వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి
Posted On 2026-02-17 18:50:50
Readmore >
భారత్ విస్తార అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం
Posted On 2026-02-17 16:33:46
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted On 2026-02-17 16:29:52
Readmore >
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-02-17 16:23:59
Readmore >