డైలీ భారత్, చింతలపాలెం:కర్ల రాజేష్ మృతికి కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారంతో చింతలపాలెం మండల కేంద్రంలో ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చింతిరాల బాల చంద్రుడు మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి ప్రధాన కారకుడైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి సస్పెన్షన్ అధికారికంగా ప్రకటించేంత వరకు ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ధర్నాలు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు. ఈ దీక్షకు ఎమ్మార్పిఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News
ఎస్సై అధికారిక సస్పెన్షన్ ప్రకటించే వరకు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి