Posted on 2025-10-21 17:22:14
డైలీ భారత్, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధ్వంసమైన రహదారులను తీరుతెన్నులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెం – ఖమ్మం మార్గంలోని జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండా వద్ద ధ్వంసమైన ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. ఆ రహదారులు ధ్వంసమైన తీరు కన్పించేలా సెల్ఫీలు దిగి ప్రసార మాధ్యమాలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ ధ్వంసమై, గుంతలమయమై ప్రమాదభరితంగా ఉన్న రహదారులకు వెంటనే ఈ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామపంచాయతీ ప్రజలు పాల్గొన్నారు
విజయనగరం : సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు
Posted On 2026-05-11 07:23:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా
Posted On 2026-05-11 07:21:04
Readmore >
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో డా. యెలగొండ ఆంజనేయులకు “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026”
Posted On 2026-05-11 07:20:06
Readmore >
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >