Posted on 2025-09-24 21:18:40
తిలక్ గార్డెన్ కాంప్లెక్ట్స్ అక్రమంగా ఫుట్ పాత్ పై వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారస్తులపై కోరడా ఝలిపించిన ట్రాఫిక్ పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన దిశ (జిల్లా విజిలెన్స్ మానిటరింగ్) కమిటీ సమావేశంలో మున్సిపల్ కాంప్లెక్స్ లో చాలామంది బినామీల చేతిలో షాపింగ్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, పుట్ పాత్ లను ఆక్రమించి దందా జరుగుతుందని దానివాలన పాదచారులకు ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని దిశ కమిటీ సభ్యులు అధికారులను నిలదీశారు. దానితో జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పోలీస్ కమిషనర్ చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు బుధవారం రంగంలోకి దిగారు. తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి గ్లామర్ హోటల్, శక్తి కూల్ డ్రింక్స్ తో పాటు ఇతరులు ఫుట్ పాత్ పై ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలను ఫ్లెక్సీలను వారు తొలగించారు. ఫుట్ పాత్ పై వ్యాపారం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ ఆలీ అన్నారు. పుట్ పాత్ లను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హేచ్చరించారు. ఐతే గ్లామర్ హోటల్ ముందు పుట్ పాత్ పై వ్యాపారం చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నారని నిజామాబాద్ ట్రాఫిక్ ఎసిపీ మస్తాన్ ఆలీ అన్నారు. పుట్ పాత్ లను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఐతే గ్లామర్ హోటల్ ముందు పుట్ పాత్ పై ఉన్న జనరేటర్ ను మాత్రం తొలగించలేదు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >