అప్రమత్తమైన అధికార యంత్రాంగం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:గత రెండు రోజుల నుండి ఏడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వీధుల్లో, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వర్షపు వరద నీరు ఆయా కాలనీలలో పూర్తిగా జలమయమయ్యాయి. కోర్టు చౌరస్తా నుంచి నటరాజ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కోర్టు చౌరస్తా నుంచి నటరాజ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు.